రేవల్లి: యంజీకేఎల్ఐ ఆయకట్టు చివరి వరకూ రైతులకు సాగు నీరందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తల్పునూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అంతకుముందు గొపాల్పేట మండల మీదుగా తల్పునూర్ గ్రామంలోని కార్యక్రమానికి హాజర వడానికి వస్తుండగా పాత తండా సమీపంలో కాలువ అసంపూర్తిగా ఉన్న కాలువ పనులను ఆయన పరిశీలించారు. అక్కడి పరిసరాల్లోని రైతులతో కాసేపు ముచ్చటించారు. అసంపూర్తిగా ఉన్న పనులను యాసంగి పూర్తైన వెంటనే చేయించడం జరుగుతుందన్నారు.
సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు అదేవిధంగా ఇటీవల నమోదైన నూతన పింఛన్లు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆయన అక్కడ ఉన్న వారికి భరొసా కల్పించారు.
కార్యక్రమంలో ఎంపీపీ బంకళ సేనాపతి, జడ్పీటీసీ భీమయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీలు కుర్మతిరెడ్డి, శ్రీశైలం యాదవ్, సర్పంచ్లు లక్ష్మి, జ్యోతి, నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు సురేశ్, నాయకులు సత్యశీలారెడ్డి, కోటిరెడ్డి, రాములు, అర్జున్రావు, సురేందర్రెడ్డి, రవి, రహీం, నసీర్, రాములు, నర్సింహా పాల్గొన్నారు.