సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో ఉస్మాన్సాగర్కి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. నాలుగు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి 1552 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హిమాయత్ సాగర్కు ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు వస్తుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2532 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు.
జంట జలాశయాల నుంచి 4084 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళుతుందని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.