Statue of Equality | ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా నేడు యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు విధించినట్లు చిన్నజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారే యాగశాలకు రావాలి. రాత్రి 8:30 గంటల తర్వాత ప్రధాని పర్యటన ముగుస్తుంది. రేపట్నుంచి యథాతథంగా యాగశాల పరిసరాల్లో అనుమతులు ఉంటాయని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు.
సాయంత్రం 4:30 గంటల నుంచి ఇక్రిశాట్ నుంచి ముచ్చింతల్కు మోదీ బయల్దేరనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామానుజచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. రాత్రి 8:05 గంటలకు యజ్ఞ పూర్ణాహుతిలో మోదీ పాల్గొననున్నారు. రాత్రి 8:20 గంటలకు మోదీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.