మహబూబ్నగర్ : వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మద్యం షాపుల రిజర్వేషన్ కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలోనే రిజర్వేషన్లు అమలు చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2,620 షాప్స్ కి గాను 756 షాప్స్ కి రిజర్వేషన్లు కల్పించాం.
363 షాప్స్ గౌడ్లకు, 262 ఎస్సీలకు 131 ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించామన్నారు. 756 వైన్ షాప్స్ రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించినట్లు వెల్లడించారు. అప్లికేషన్, లైసెన్స్ ఫీజు పెంచలేదన్నారు. నామమాత్రంగా షాప్స్ సంఖ్యను పెంచినం. ఒక మనిషి ఒకే షాప్ నిబంధన తీసివేశామని మంత్రి పేర్కొన్నారు. గుడుంబా, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.
వృత్తి కులాల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడాలని సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం