బీజింగ్, అక్టోబర్ 24: అంతరిక్ష వ్యర్థాల తగ్గింపు కోసం అభివృద్ధి చేసిన సాంకేతికతలను పరీక్షించేందుకు చైనా ఆదివారం ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. లాంగ్ మార్చ్-3బీ రాకెట్ సాయం తో షిజియాన్-21 ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. సిచువాన్ ప్రావిన్స్లోని షిచాంగ్ ఉపగ్రహ కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.