మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే చిత్రం చేస్తుండగా, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుండగా, దానిపై డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కాని మనకు ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు అని రాసి ఉంది.
చాలా రోజుల తర్వాత దేవా కట్టా నుంచి వస్తున్న పక్కా పొలిటికల్ సినిమా రిపబ్లిక్ కాగా, ఈ సినిమా పూర్తిగా ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. హైలీ ఇంటెన్స్ డ్రామాగా రిపబ్లిక్ వస్తుంది. ప్రస్థానం లాంటి సినిమా తర్వాత దేవా కట్టా నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్తో అంతకంటే హై ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు . మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో చూడాలి.