హైదరాబాద్ : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాచెన్నగారి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంత్రి హరీశ్ రావును కలిశారు. ఈ నెలలో కొన్నిచోట్ల క్రషర్స్ లీజు గడువు ముగిసిందని, వాటిని తిరిగి రెన్యూవల్ చేయాలని కోరారు.
స్థానికంగా కొన్ని చోట్లు పలు రకాల సమ్యలు ఎదిర్కొంటున్నామని వాటిని పరిష్కరించాలని విన్నవించారు. స్టోన్ క్రషర్ల నుంచి ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీని తొలిగించాలన్నారు. తమ క్రషర్స్ వల్ల ఈ మధ్య కాలంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.