ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. మంచి చెడుల గురించి నెటిజన్స్తో తరచు చర్చిస్తూ ఉంటుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కరోనా బాధితులకు సాయం చేస్తూ ఔదార్యం చాటుతూ వస్తుంది. అయితే ఓ బ్యాంకింగ్ వ్యవహారాలు చూసి షాకైన రేణూ దేశాయ్ అకౌంట్ని క్లోజ్ చేయబోతున్నానంటూ పోస్ట్ పెట్టింది.
వివరాలలోకి వెళితే రేణూ దేశాయ్కి ఇండస్ ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఉంది. తరచు ఈ బ్యాంక్ ద్వారా లావా దేవీలు జరుపుతూ ఉంటుంది. అయితే తన మొబైల్ యాప్లో రేణూ లాగిన్ కాగా, వేరొకరి ఖాతా ఓపెన్ అయింది. అందులో సదరు ఖాతాలోని పూర్తి వివరాలు కనిపిస్తున్నాయి.. దీంతో షాక్ అయిన రేణూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. రేణూ పోస్ట్ చూసి సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా షాక్కి గురయ్యారు.