మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫీలింగ్స్తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడు నెటిజన్స్తో పంచుకుంటుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వలన ఇంటికే పరిమితమైన రేణూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ తన వంతు సాయం చేస్తుంది. అయితే అకీరా ఎంట్రీ గురించి నెటిజన్స్ రేణూని పదే పదే ప్రశ్నలు అడుగుతుండగా, ఆమె సింపుల్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకుంటుంది.
తాజాగా ఇది అకీరా ఎంట్రీ గురించి చెప్పే సమయం కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని రేణు చెప్పడంతో అకీరా ఎంట్రీ ఉంటుందిని అంతా భావిస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ తన తనయుడితో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగల ఒకే ఒక్కడు అకీరా. అతని జోకులు వింటుంటే నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుందని తెలిపింది రేణూ దేశాయ్.