రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. 1970 దశకంలో పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో సీనియర్ నటి రేణు దేశాయ్ సామాజిక కార్యకర్త హేమలత లవణం పాత్రను పోషిస్తున్నది. అంటరానితనం, సామాజిక అసమానతలపై ఆ కాలంలో ఆమె పోరాటం చేశారు. ప్రజల్ని జాగృతపరిచే ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టారు. గురువారం సినిమాలోని రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ను విడుదల చేశారు. సినిమాలో రేణు దేశాయ్ పాత్ర స్ఫూర్తివంతంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.