అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెమిడిసెవిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొవిడ్ బాధితుల అవసరాన్ని ఆధారం చేసుకొని భారీ ధరలకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి నుంచి 27 ఇంజక్షన్లతోపాటు రూ. లక్షా 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కొంతకాలంగా వీరు ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇటీవల ఏలూరు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది సైతం ఇంజక్షన్లను పక్కదారి పట్టించి విక్రయించి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కరోనా సమయంలోనూ మానవత్వాన్ని మరిచి కొందరు కొవిడ్ బాధితుల ప్రాణాలతో వ్యాపారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.