హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : భారత సంతతి వ్యక్తులు, గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పిల్లల కోసం బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ను జేఎన్టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులలో మే 2 నుంచి జూలై 4వ తేదీ వరకు, పీజీ కోర్సులలో ఆగస్టు 30వతేదీ వరకు www.jntuh.ac.in/ www.jntuhdufr.com నుంచి ప్రవేశాలు పొందాలని వివరించింది.