హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజనలో భాగమైన రిపేర్, రిజువనేషన్, రిస్టోరేషన్ (ఆర్ఆర్ఆర్)కు కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తేనే అందుకు సంబంధించిన పనులను చేపడతామని జల్శక్తి శాఖకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ స్పష్టంచేశారు. కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయమై రజత్కుమార్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ కింద తెలంగాణ ప్రభుత్వం నాలుగు దశల్లో 22 జిల్లాల్లో మొత్తంగా 500కు పైగా చెరువులను ప్రతిపాదించింది. పనులకు సంబంధించిన నిధులను 60ః40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిధులను విడుదల చేయలేదు. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తేనే ఆర్ఆర్ఆర్ పనులను ప్రారంభిస్తామని రజత్కుమార్ వెల్లడించారు.