న్యూఢిల్లీ : పలు లీక్లు, స్పెక్యులేషన్ల నడుమ ఎట్టకేలకు రెడ్మి నోట్ 11టీ భారత్లో లాంఛ్ అయింది. గత నెలలో చైనాలో లాంఛ్ అయిన రెడ్మి నోట్ 11 భారత్లో రూ 16,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఎంఐ.కాంల నుంచి ఈ స్మార్ట్పోన్ను కొనుగోలు చేయవచ్చు.
ప్రవేశ ఆఫర్ కింద ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్కార్డు ద్వారా లావాదేవీలపై రూ 1000 డిస్కౌంట్తో పాటు అదనంగా మరో రూ 1000 డిస్కౌంట్ను షియామి ఆఫర్ చేస్తోంది. ఇక రెడ్మి నోట్ 11టీ 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్తో పాటు 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెల్ఫీ లెన్స్తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో కస్టమర్ల ముందుకొచ్చింది. 33డబ్ల్యూ చార్జింగ్ సపోర్టతో రెడ్మి నోట్ 11టీ 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది.