ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల్ ధరల్లో పన్నులదే ఎక్కువ వాటా ఉంటుంది. ఉదాహరణకు దేశ రాజధానిలో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వరుసగా 34.8 శాతం, 23.08 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయి. దీంతో అక్కడ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.
రిటైల్ పెట్రోల్ ధరల్లో 58 శాతం వ్యాట్, పన్నుల రూపంలో పోతుంది. రిటైల్ డీజిల్ ధరలో 52 శాతం పన్నులు, వ్యాట్ రూపంలో ఉంటుంది. ఇటీవల కరోనా కారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతేస్థాయిలో తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం పన్ను శాతాన్నిపెంచింది. దీంతో పెట్రోల్ , డీజిల్ ధరలపై ప్రభావం కనిపించింది.