న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్ మీ 2021లో తన తొలి ఫ్లాగ్షిప్ ఫోన్ రియల్మీ GT 5Gని విడుదల చేసింది. 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ కలిగిన ఫోన్ను ముందుగా చైనాలో ఆవిష్కరించింది. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ జీటీ 5జీ ఫోన్ ధర చైనాలో31,500 కాగా, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37వేలుగా నిర్ణయించారు. త్వరలోనే ఫోన్లను ప్రపంచమార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తామని రియల్మీ వెల్లడించింది.
రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే:6.43 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సల్
రియర్ కెమెరా:64+8+2 మెగా పిక్సల్
బ్యాటరీ కెపాసిటీ:4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11