న్యూఢిల్లీ: రియల్మీ 8 సిరీస్లో రియల్మీ 8 ప్రొ, రియల్మీ 8 స్మార్ట్ఫోన్లను కంపెనీ మంగళవారం భారత్లో విడుదల చేసింది. ఈ ఫోన్లతో పాటు రియల్మీ స్మార్ట్ బల్బ్, రియల్మీ స్మార్ట్ స్కేల్ను తీసుకొచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ 8 సిరీస్ ఫోన్ల ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్, రియల్మీ డాట్ కామ్ ద్వారా రెండు హ్యాండ్సెట్లను వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. రియల్మీ 8 మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండగా సైబర్ సిల్వర్, సైబర్ బ్లాక్ కలర్లలో విడుదలైంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్తో 1500 వరకు తగ్గింపు వర్తించనుంది.