ముంబై: రియల్ ఎస్టేట్ డెవలపర్ పారస్ పోర్వాల్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ముంబైలోని ఓ బిల్డింగ్లో ఉన్న 23వ అంతస్తు నుంచి ఆయన దూకినట్లు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల ఆ బిల్డర్ ఇంట్లో సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదు అని, విచారణ కూడా అవసరం లేదని ఆ నోట్లో రాశాడు.
ముంబైలోని చించిపోక్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శాంతి కమల్ హౌజింగ్ సొసైటీ బిల్డింగ్లోని తన బాల్కనీ నుంచి ఇవాళ ఉదయం 6 గంటలకు బిల్డర్ పారస్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పారస్ దూకిన విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు. స్థానిక పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం సివిల్ ఆస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.