రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు ఆసక్తికరంగా మొదలైంది. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (8), దేవదత్ పడిక్కల్ (7) ఇద్దర్నీ బెంగళూరు పేసర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చారు. వీళ్లిద్దరి కన్నా రవిచంద్రన్ అశ్విన్ (17) ఎక్కువ రన్స్ చేయడం గమనార్హం.
ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. కీలకమైన బట్లర్ వికెట్ను ఆసీస్ పేసర్ హాజిల్వుడ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. మిడిలార్డర్ సరిగా ఆడకుంటే ఆ జట్టు కోలుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది.