ముంబై, నవంబర్ 26: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోటి రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ ఫైన్ వేసినట్లు శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో బ్యాంక్కు షేర్లున్నట్లు గుర్తించడంతో ఈ జరిమానా పడింది.