Home Loans | పెరిగిపోతున్న ధరలకు కళ్లెం వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం మరో 50 బేసిక్ పాయింట్లు (0.50శాతం) రెపోరేట్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 4.90 నుంచి 5.40 శాతానికి దూసుకెళ్లింది. ఫలితంగా ఇండ్ల రుణాలు మొదలు ఆటో, పర్సనల్ లోన్లు పిరం కానున్నాయి. ఆయా రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు కూడా భారం అవుతాయి. ఉదాహరణకు అన్వేష్ 7.55 శాతం వడ్డీపై 20 ఏండ్లకు రూ.లక్షల రుణం తీసుకున్నాడుకుందాం. అతడి రుణంపై నెలవారీ వాయిదా (ఈఎంఐ) రూ.24,260. ఈ వడ్డీరేటుపై అన్వేష్ రూ.28,22,304 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.20 లక్షల అసలుకు బదులు మొత్తం రూ.58,22,304 చెల్లించాల్సి వస్తుంది.
అన్వేష్ ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచితే.. బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీరేటు 0.50 శాతం పెంచాయి. తదనుగుణంగా అన్వేష్ రుణం టెన్యూర్ పెరుగుతుంది. అన్వేష్ మిత్రుడు భావిష్ కొత్తగా ఇప్పుడు రుణం తీసుకుంటే.. ఆ బ్యాంకు 7.55 శాతానికి బదులు 8.05 శాతం వడ్డీపై రుణం ఇచ్చింది. అన్వేష్ లాగానే భావిష్ కూడా 20 ఏండ్లకు రూ.30 లక్షల రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.25,187 చెల్లించాల్సి ఉంటుంది. అన్వేష్ ఈఎంఐ కంటే భావిష్ అదనంగా రూ.927 పే చేయాలి. ఈ లెక్కన అన్వేష్ ఫ్రెండ్ 20 ఏండ్లలో అసలూ వడ్డీ కలిపి రూ.60,44,793 పే చేయాల్సి ఉంటుంది. అంటే భావిష్ అదనంగా రూ.2,22,489 పే చేయాలన్నమాట.
ఇంటి రుణ వడ్డీరేట్లు రెండు రకాలు. ఒకటి ఫ్లోటర్.. రెండవది ఫ్లెక్సిబుల్.. ఫ్లోటర్లో వడ్డీరేటుకు అనుగుణంగా రుణ వాయిదాలు పెరుగుతాయి. ఫ్లెక్సిబుల్ వడ్డీరేట్ పద్దతిలో ఈఎంఐ పెరుగుతుంది. మీరు ఇప్పటికే ఫ్లెక్సిబుల్ వడ్డీరేటుపై ఇంటి రుణం తీసుకుంటే ఈఎంఐ భారమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్రవ్యపరపతి సమీక్ష ఏప్రిల్లో జరిగింది. సాధారణంగా రెండు నెలలకోసారి ద్రవ్య పరపతి సమీక్ష జరుగుతుంది. కానీ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతో మే 2,3 తేదీల్లో అత్యవసరంగా సమావేశమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష కమిటీ 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచింది. జూన్లో 50 బేసిక్ పాయింట్లు.. తాజాగా మరో 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో నాలుగు నెలల్లో రెపోరేట్ 1.40 శాతం పెంచినట్లయింది. 2020 మే 22 తర్వాత రెపోరేట్లో వచ్చిన మార్పులివి.