దుబాయ్: ఫిబ్రవరికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు దక్కింది. ఇంగ్లండ్తో నాలుగు టెస్టుల సిరీస్లో బంతితో మాయ చేసి 30 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ ఓ శతకంతో అశ్విన్ అదరగొట్టాడు. 3-1తో సిరీస్ను కైవసం చేసుకొని ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు భారత్ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అశ్విన్ ఇదే టెస్టు సిరీస్లో దాటాడు. జో రూట్, కైల్ మేయర్స్ కూడా అవార్డు పోటీలో నిలువగా అభిమానులు ఓటింగ్ ద్వారా అశ్విన్కే పట్టం కట్టారు.