Ramcharan tej-goutham tinnanuri movie | మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన ట్రిపుల్ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. జూ.ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న #RC15 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు అత్యంత భారీగా నిర్మిస్తున్నాడు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో రామ్చరణ్ తన 16 సినిమాను చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నను హీరోయిన్గా కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం. రష్మికకు నేషనల్ వైడ్గా మంచి క్రేజ్ ఉంది. తాజాగా పుష్ప సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే రష్మికను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తుందట. దీశాపటాని ప్లేస్లో రష్మికను తీసుకున్నారని గత రెండు మూడు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మేకర్స్ దాదాపు రష్మికను ఖరారు చేశారట. ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ హిందీ రీమేక్ విడుదలకు సిద్దంగా ఉంది.