సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే బుల్లి తెర యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ అమ్మడు బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై కూడా అలరిస్తుంటుంది. ఈ మధ్య సినిమాలు తగ్గించేసి కేవలం బుల్లితెరకే ఫిక్స్ అయింది. అయితే జంతు ప్రేమికురాలు అయిన రష్మీ మూగ జీవాలని ఎవరైన హింసించిన విషయం తన దృష్టికి వస్తే వెంటనే ప్రశ్నిస్తుంది. వారిపై తన కోపాన్ని వెళ్లగక్కుతుంది.
మధ్యప్రదేశ్ దేవాస్లోని వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. దాదాపు 30 నిమిషాల పాటు కుక్కను తాడుతో కట్టి కొట్టి చంపగా, ఈ వీడియోను మధ్యప్రదేశ్లోని దివాస్లో చిత్రీకరించారు. ఓ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేశారు.
ఈ దారుణ ఘటనపై స్పందించిన రష్మీ గౌతమ్.. ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారన్నమాట. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. ఈ భూమి మీద ఉండే అర్హత లేదని చెబుతూ ఎమోషనల్ అయింది. రష్మీ లాక్డౌన్ సమయంలోమూగ జీవాలను అక్కున చేర్చుకున్న విషయంతెలిసిందే.