బుల్లితెర నటి రష్మీ గౌతమ్కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ముఖ్యంగా మూగజీవాలపై దాడులు చేసే వారిపై ఆగ్రహం వెళ్లగక్కుతూ ఉంటుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ ఘటన బయటకు రాగా,అది చూసి రష్మీ చలించిపోయింది. వారి ఆకృత్యాలను తలచుకోని మానవత్వం చచ్చిపోతుందని కామెంట్ చేసింది..
దీపావళి సంబరాల్లో మునిగిపోయిన కొందరు ఆకతాయిలు వీధి కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై, తోక తెగి పడిపడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ కుక్క సురక్షితంగానే ఉందట. ఈ విచారకమైన వార్త రష్మీ కంటపడటంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ దుర్ఘటన తాలూకు మీడియా సందేశాన్ని తన సోషల్ మీడియా వాల్పై పోస్ట్ చేసింది.
మానవత్వం చచ్చిపోయింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు లేదంటూ విరుచుకుపడింది. రష్మీ పోస్ట్ చేశాక ఈ దారుణ ఘటన గురించి చాలామందికి తెలియడంతో అందరూ భగ్గుమంటున్నారు. ఆ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.