టాలీవుడ్ డైరెక్టర్ మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రతీ రోజూ పండగే చిత్రం తర్వాత రాశీఖన్నా కోసం క్రేజీ రోల్ ఒకటి మారుతి డిజైన్ చేశాడట. ఈ మూవీలో టీవీ సీరియల్ నటిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఫన్నీ క్యారెక్టరైజేషన్ తో రాశీఖన్నా రోల్ సాగుతుందట.
గీతాఆర్ట్స్-2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో గోపీచంద్ ఎటువంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. గోపీచంద్ మరోవైపు సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ చిత్రంలో నటిస్తున్నాడు. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 2 న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.