కరోనా వలన ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ తెగ వినోదం పంచుతున్నారు. చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం వెంకటేష్ నారప్ప, నాని టక్ జగదీష్ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక రీసెంట్గా నితిన్ మ్యాస్ట్రో చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీమేక్గా మాస్ట్రో తెరకెక్కగా, ఇందులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. టబు పాత్రను మమతా మోహన్ దాస్ పోషించింది.ఈ చిత్రాన్ని అక్టోబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేయబోతున్నారు.
రాశి ఖన్నా విషయానికి వస్తే ఈ అమ్మడు అరడజనుకి పైగా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచిన రాశీఖన్నా తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో నటిస్తోంది. వీటితో తన పాత ఫాంని మళ్లీ అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.