ఢిల్లీ ,జూన్ 8: కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ హైదరాబాద్కు చెందిన సంస్థ. మొదటి దశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఆదిత్యపూర్, చెన్నై నగరాలలో, ఆ తర్వాత మరో 25కి పైగా నగరాల్లో రీసైక్లింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఇందుకు ప్రయాణికుల సరకు రవాణా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, విధానాలతో ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు రాంకీ వెల్లడించింది.
దేశంలో 2025 నాటికి కాలం చెల్లే వాహనాలు రెండు కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఈ వాహనాలను సరైన పద్ధతిలో రీసైకిల్ చేయకపోతే వాయు కాలుష్యం పెరుగుతుందని, కేంద్రం వెహికిల్ స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించించింది. వెహికిల్ రీసైక్లింగ్ కోసం రాంకీ పాసింజర్ వెహికిల్ సెగ్మెంట్, కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్ రంగంలోని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.15నుంచి 20ఏండ్లు నిండిన కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని, తద్వారా ఉద్గారాలు తగ్గించాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే.