షాబాద్, జూలై 5: హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో విరివిగా మొక్కలను సిద్ధం చేశారు. జిల్లా లో ఈ ఏడాది 78.26 లక్షల మొక్కలను నాటాలని అధికారులు ప్రణాళికను రూపొందించుకోగా.. అన్ని నర్సరీల్లో కలిపి కోటికి పైగా వివిధ రకాల మొక్కల ను అందుబాటులో ఉంచారు. ఆయా గ్రామాల్లోని కాల్వ గట్లు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచారు. వచ్చే వారంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నది. మొక్కలను నర్సరీల్లో పెంచి నాటించే బాధ్యతను డీఆర్డీవో, మున్సిపాలిటీ, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం అప్పగించింది.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
హరితహారంలో భాగంగా నాటే మొక్కల్లో 85 శా తం బతికేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిబంధనను అమలు చేయనున్నది. ఇప్పటికే ప్ర భుత్వం ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్లు, ట్యాంకర్లను అందించింది. వీటి సహాయంతో ఏడాది పాటు వన సంరక్షకులు నీటిని అందిస్తున్నారు. అదేవిధం గా అడవులు, రహదారులు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల మైదానాలు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పూ లు, పండ్ల మొక్కల పంపిణీకి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్షాలు కురిసిన వెంటనే మొ క్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టనున్నారు.
జిల్లాలో టార్గెట్..78.26 లక్షలు
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 78.26 లక్షల మొక్కలను నాటించాలని అధికారులు ప్రణాళికను రూపొందించారు. 558 నర్సరీల్లో ఒక్కో నర్సరీలో 18 వేల మొక్కల చొప్పున మొత్తం కోటికి పైగా మొ క్కలు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. ఇచ్చిన టార్గెట్లో అటవీశాఖ 8 లక్షలు, విద్యాశాఖ 78 వేలు, గ్రామీణాభివృద్ధి శాఖ 31.50 లక్షలు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ 5.25 లక్షలు, వ్యవసాయశాఖ 3.15 లక్షలు, ఇరిగేషన్ శాఖ 10 వేలు, ఎక్సైజ్ శాఖ సరూర్నగర్ 52 వేలు, ఎక్సైజ్శాఖ శంషాబాద్ 52 వేలు, వైద్యశాఖ 10 వేలు, పరిశ్రమల శాఖ 2.62 లక్షలు, హార్టికల్చర్ శాఖ 1.05 లక్షలు, దేవాదాయశాఖ 10 వేలు, సోషల్ వెల్ఫేర్ శాఖ 10 వేలు, మార్కెటింగ్ శాఖ 10 వేలు, పౌరసరఫరాల శాఖ 5 వేల మొ క్క లతోపాటు జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో నాటనున్న 23.96 లక్షలతో కలిపి మొత్తం 78.26 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.82 లక్షల మొక్కలను నాటినట్లు చెబుతున్నారు.
ఈ ఏడాది టార్గెట్.. 78.26 లక్షల మొక్కలు..
జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖ లు కలిపి మొత్తం 78.26 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. ఇందులో ఇప్పటి కే 2.82 లక్షల మొక్కలను నాటడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే అన్ని గ్రామా ల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అన్ని గ్రామాల్లోని ఇం టింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నాం. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేస్తాం.
-జానకీరామ్, రంగారెడ్డిజిల్లా అటవీశాఖ అధికారి