కొత్తూరు రూరల్, జూన్ 27: నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని డీపీవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాప్రాంగణం చుట్టూ 300 మొక్కలను నాటాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత గ్రామ పంచాయతీదేనన్నారు. పల్లెప్రకృతి వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ అజయ్నాయక్ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శరత్చంద్రబాబు, ఎంపీవో నర్సింహ, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, లింగం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.