రంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అనంతరం పోడు భూముల సమ స్య పరిష్కారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్న ట్లు సమాచారం. అంతేకాకుండా అటవీ భూములు ఇకపై అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 670 ఎకరా ల్లో అటవీ భూములు కబ్జాలో ఉన్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తేల్చారు. జిల్లాలోని మంచాల, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, సరూర్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని 69 గ్రామాల్లో అటవీ భూములు కబ్జాకు గురైనట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 780 మంది అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మం చాల మండలంలో 555 ఎకరాలు, హయత్నగర్ మండలం లో 32.11 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 10 ఎకరాలు, సరూర్నగర్ మండలంలో 58 ఎకరాలు, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 15 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాలో ఉన్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తేల్చారు.
సర్కారు కసరత్తు
పరిగి, అక్టోబర్22: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సైతం పాల్గొననున్నారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ నిఖిల, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవరావు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో అటవీ భూములను ఇతరులు సాగు చేస్తున్న వివరాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. జిల్లా పరిధిలో 2005 డిసెంబర్ కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న 672 మం దికి 1133.3 ఎకరాలకు సంబంధించి అప్పట్లో ఆర్వోఎఫ్ఆర్ అందజేశారు. ఆర్వోఎఫ్ఆర్ పొందిన వారిలో గిరిజనులు, చెంచులు, ఎరుకల కులస్తులున్నారు. వారు జీవితాంతం ఈ భూమిని సాగు చేసుకుని జీవించొచ్చు. కానీ విక్రయించడం, ఇతరుల పేరున మార్చడం చేయరాదు. వారిలో 600 మందికి రైతుబంధు కింద పెట్టుబడి సాయం కూడా అందుతున్నది. ఇందులో 58మంది చనిపోగా, నలుగురికి డబుల్గా సర్టిఫికె ట్లు అందాయి. మిగతా పదిమంది ఇతర ప్రాంతాలకెళ్లి జీవిస్తున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2,500 ఎకరాల కు పై చిలుకు అటవీ భూములను ఇతరులు సాగు చేస్తున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాలు ఎస్టీలు, 700 పైచిలుకు ఎకరాల్లో ఎస్సీలు, మిగతాది బీసీలు సాగు చేస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు.