మంచాల అక్టోబర్ 22 : విజయగర్జన సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కుటుంబ సభ్యులపై ఉందని పార్టీ మండలాధ్యక్షుడు రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దండేటికార్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బహదూర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈనెల 27న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జేఎన్టీయూ కళాశాల ఆవరణలో నిర్వహించనున్నామన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హాజరవుతారని, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. నవంబర్ 15న 20 లక్షల మందితో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీటీసీలు సుకన్య, అనిత టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, సికిందర్రెడ్డి, బద్రినాథ్ గుప్తా, జంగారెడ్డి పాల్గొన్నారు.
బడుగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 22 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వైఎన్ఆర్ గార్డెన్లో పార్టీ మండలాధ్యక్షుడు కిషన్గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్ఎస్ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల 27న మన్నెగూడలోని వేదా కన్వెన్షన్లో నిర్వహించే నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమాశానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే బహిరంగ సభ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మన్ విఠల్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, జిల్లా కోఆప్షన్సభ్యుడు అక్బర్అలీ, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, నాయకుడు దేవేందర్గౌడ్, విద్యార్థి విభాగం, బీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.
అనుబంధ సంఘాలు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 22 : మండలంలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైన మండల, గ్రామస్థాయి కమిటీలతో పాటు అనుబంధ సంఘాల నాయకులు కష్టపడి పనిచేయాలని ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోల్ లక్ష్మీగార్డెన్లో టీఆర్ఎస్ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మండలాధ్యక్షుడు బుగ్గ రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27న నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి సమావేశానికి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, నాయకులు గణేశ్, నర్సింహ, రాములు పాల్గొన్నారు.