వనపర్తి : జిల్లాలోని శ్రీరంగాపురంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. గోవింద నామస్మరణ మధ్యలో రంగనాథ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామికి ఆలయ ధర్మకర్త శ్రీ కృష్ణదేవ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన రథోత్సవం అశేష జనం మధ్య రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.