రంగారెడ్డి, జూన్ 7, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ వరుసగా ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మాసబ్ట్యాంక్లోని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యదర్శిగా బి.బుచ్చిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.విజయకుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా ఆనంద్సింగ్, తదితరులు ఎన్నికయ్యారు. జిల్లా టీఎన్జీవో కార్యవర్గ ఎన్నికలకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, ఈశ్వర్తోపాటు అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఉద్యోగులు ప్రతిసారి కేంద్ర సంఘానికి సహాయ, సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వరుసగా ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామన్నారు. టీఎన్జీవో ఎన్నికల అధికారిగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వ్యవహరించగా, నూతన కార్యవర్గం మూడేండ్లపాటు కొనసాగనున్నది.