మూసాపేట(అడ్డాకుల), మార్చి 18 : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తేరును లాగేందుకు పోటీపడ్డారు.
ఈ సందర్భంగా ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేయగా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిజరూప దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దండు కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.