చాలా గ్యాప్ తర్వాత మోసగాళ్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు యఫ్యామిలీ హీరో విష్ణు. పాన్ ఇండియా చిత్రంగా మోసగాళ్లు తెరకెక్కగా, ఈ చిత్రం మార్చి 19న థియేటర్స్లోకి వచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా మోసగాళ్లు చిత్ర బృందాన్ని అభినందించారు
మోసగాళ్లు టీంకు అభినందనల. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ గురించి విన్నాను. నా సోదరుడు మంచు విష్ణు, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్తో పాటు పాటు ఇతర బృందం అద్భుతంగా నటించారు. ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్ తప్పక చూడండి అంటూ చరణ్ ట్వీట్ చేశారు. దీనికి మంచు విష్ణు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందిన మోసగాళ్లు చిత్రాన్ని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మించారు.తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. అమెరికాలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.