హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బుధవారం ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసిన అనంతరం తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, ఉపేందర్రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు.