తిరుమల : తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్ లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆకాశ గంగ తీర్ధంలో కొలువైయున్న బాలహనుమన్, అంజనాదేవిలను దర్శించుకున్నారు.