న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యక్రమాలు రేపటి నుంచి పాత విధానంలో కొనసాగనున్నాయి. వివిధ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు రాజ్యసభ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు ఎంపీ వందనా చౌహాన్ తెలిపారు. మంగళవారం నుంచి రాజ్యసభ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నది. కోవిడ్కు ముందు ఉన్న సమయం ప్రకారమే సభా కార్యక్రమాలు జరగనున్నాయి. సభ్యులు రాజ్యసభ, గ్యాలరీలో మాత్రమే కూర్చుంటారని ఎంపీ వందనా చౌహాన్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో రాజ్యసభ, లోక్ సభ సమావేశాల సమయంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకు రేపటి నుంచి సభ పూర్తి స్థాయిలో తమ బిజినెస్ నిర్వహిస్తుందని ఆమె అన్నారు. ఆ తర్వాత రాజ్యసభను ఆమె రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఇవాళ ఉదయం రెండుసార్లు సభ వాయిదా పడింది. ఇంధన ధరలపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో సభను వాయిదా వేశారు.