న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల సెగ రాజ్యసభను కుదిపేసింది. మంగళవారం సభ మొదలవగానే పెట్రో ధరల పెంపును నిరసిస్తూ విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. పెట్రో ధరలు అంతకంతకే పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతున్నదని వారు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.