ముంబై: అశ్లీల చిత్రాలను చిత్రీకరించారన్న అభియోగాలతో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న బిజినెస్మెన్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి రాజ్కుంద్రా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు ముందుకు వచ్చారని వినికిడి. ఇందుకోసం వారు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని సంప్రదించారని తెలియ వచ్చింది.
ప్రత్యేకించి రాజ్ కుంద్రా వ్యాపార లావాదేవీల ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల కీలక డేటా వెలుగు చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన సహకరించడం లేదని ముంబై పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన సదరు ఉద్యోగులు నలుగురు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో మేజిస్ట్రేట్ ముందు వీరి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేయనున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే, ముంబైలో గల రాజ్కుంద్రా.. వియాన్ ఇండస్ట్రీస్ ఆఫీసుల్లో శనివారం నగర పోలీసులు జరిపిన సోదాల్లో ఒక లాకర్ లభ్యం అయినట్లు వినికిడి. క్రిప్టో కరెన్సీ లావాదేవీల పత్రాలు, వ్యాపార ఒప్పందాలు అందులో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇంతకుముందు జరిపిన తనిఖీల్లో ఈ లాకర్ దొరకలేదు. దీన్ని శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులు రహస్యంగా దాచి పెట్టారని తెలుస్తున్నది. ఈ లాకర్లో దాచిపెట్టిన పత్రాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారని విశ్వసనీయ వర్గాల కథనం.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?