కురుక్షేత్ర, డిసెంబర్ 1: హైదరాబాద్లోని ఇక్రిశాట్కు చెందిన యువ శాస్త్రవేత్త రాజీవ్ వార్షిణె.. రాజీబ్ గోయల్ ప్రైజ్కు ఎంపికయ్యారు. మరో ముగ్గురు యువ శాస్త్రవేత్తలు రజనీశ్మిత్ర (ఐఐటీ ఇండోర్ -ఐప్లెడ్ సైన్సెస్), కేఎం సురేశన్ (ఐఐఎస్ఈఆర్, తిరువనంతపురం- కెమికల్ సైన్సెస్), సుమన్ చక్రవర్తి (ఐఐటీ ఖరగ్పూర్ -ఫిజికల్ సైన్సెస్)ని కూడా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీ వెల్లడించింది. అవార్డు కింద పతకం, ప్రశంసాపత్రం, రూ.లక్ష నగదు పురస్కారం అందించనున్నట్టు తెలిపింది.