జైపూర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్ చక్సులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారు జామున చక్సు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమోడియా కట్ సమీపంలోని హైవేపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు యువకులు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన రీట్ (REET) కోసం వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులందరూ బరన్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. రీట్ పరీక్ష రాసేందుకు వ్యాన్లో వెళ్తున్న సమయంలో చక్సు వద్దకు రాగానే.. వాహనం అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ సహా ఆరుగురు వ్యక్తులకు ప్రమాదంలోనే మృతి చెందారు. గాయపడ్డ వారిని ఎంజీహెచ్ ఆసుప్రతికి తరలించగా, చికిత్స పొందుతున్నారు.