జైపూర్ : ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను హత్య చేసిన నిందితులను నాలుగు రోజుల్లోగా ఉరితీయాలని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ డిమాండ్ చేశారు. కన్హయ్యలాల్ హత్య విషయం తెలిసినప్పటి నుంచి తన రక్తం మరుగుతోందని నిందితులను తక్షణమే హతమార్చాలని, వారిని నాలుగు రోజుల్లోగా ఉరి తీయాలని ఆయన పేర్కొన్నారు. ఇక
దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో టైలర్ హత్య ఘటనలో పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్ధ స్లీపర్ సెల్ ప్రమేయం ఉందని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించారు. బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మ స్టేటస్ పెట్టుకున్నందుకు మంగళవారం ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇస్లాంకు అవమానం జరిగిందని, ఇందుకు ప్రతీకారంగా టైలర్ను హత్య చేశామని నిందితులు ఆన్లైన్ వీడియోలో పేర్కొన్నారు.
టైలర్ హత్యతో హింసాత్మక ఘటనలు జరగడంతో రాష్ట్రంలో నెలరోజుల పాటు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని రాజస్ధాన్ ప్రభుత్వం తెలిపింది. ఉదయపూర్ నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయ్పూర్ హత్య ఘటనపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ జైపూర్లోని తన నివాసంలో ఉన్నత స్ధాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.