జైపూర్ : రాజస్థాన్లోని బికనీర్ను వరుసగా రెండో రోజు భూకంపం వణికించింది. గురువారం ఉదయం 7.42 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు ఏమీ అందలేదని పేర్కొంది. రాజస్థాన్కు సమీపంలో ఉన్న పాక్లో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. బికనీర్కు పశ్చిమ-వాయువ్య దిశలో 343 కిలోమీటర్ల దూరంలో.. జోధ్పూర్కు వాయువ్యంగా 439 కిలోమీటర్ల దూరంలో, భూమికి 110 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు బుధవారం రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది.