దేశంలో జరుగుతున్న మత ఘర్షణలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా వున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రశ్నించారు. కొన్ని రోజులుగా మత ఘర్షణలు జరుగుతున్నాయని, అయినా ప్రధాని మౌనంగానే వున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని మత ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా లోతైన దర్యాప్తు చేయించాలని, ఇలా చేసి, ఆయన ధైర్యాన్ని నిరూపించుకోవాలని గెహ్లోత్ సవాల్ విసిరారు.
అల్లర్లు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? అన్న నిజాలు ఈ విచారణ ద్వారానే వెలుగులోకి వస్తాయని రాజస్థాన్ సీఎం అభిప్రాయపడ్డారు. వాటివల్ల ఏ రాజకీయ పార్టీ లాభం పొందుతుందన్న విషయం కూడా బయటికి వస్తుందంటూ చురకలంటించారు. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
చింతన్ శిబిర్ వేదికగా ప్రజలకు మరింత చేరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.