నమస్తే బృందం, మార్చి 24: ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. కరీంనగర్లోని కలెక్టరేట్లోని హెలీప్యాడ్ పార్కులో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ను కలెక్టర్ కే శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ జెండా ఊపి ప్రారంభించగా, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్లాల్, ఏనుగు నర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూశర్మ ఫ్రీడం రన్ను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ రాహుల్హెగ్డే జెండా ఊపి ఫ్రీడం రన్ను ప్రారంభించగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.