జయశంకర్ భూపాలపల్లి : రైతుబంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పంట పెట్టుబడి సాయం కోసం రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంతో అన్నదాతలు సంతోషంగా ఊరూరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
అందులో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి హాజరై ముగ్గులు వేశారు. బతుకమ్మ ఆడారు. ఆట పాటలతో రైతుల్లో నూతనోత్సవాన్ని నింపారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.