హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. తూర్పు, ఉత్తర ఉపరితల ఆవర్తనం మరాఠ్వాడా నుంచి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది.
ఇవికూడా చదవండి..