సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడగా, ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి.
షేక్పేటలో అత్యధికంగా 1.2, గోల్కొండలో 1.1, గచ్చిబౌలి, ఏఎస్రావునగర్లో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసే అవకాశమున్నట్లు తెలిపారు.